నటుడు శ్రీహరి భార్యకు జనసేనాని ఆహ్వానం...?

శ్రీహరి. ఈయన గురించి అస్సలు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శ్రీహరి. ఆయన నటించిన సినిమాలు ఎన్నో విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. కొంతమంది అభిమానులు హీరో ఎవరు అనే దానికన్నా శ్రీహరి నటించ

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (15:48 IST)
శ్రీహరి. ఈయన గురించి అస్సలు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శ్రీహరి. ఆయన నటించిన సినిమాలు ఎన్నో విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. కొంతమంది అభిమానులు హీరో ఎవరు అనే దానికన్నా శ్రీహరి నటించిన సినిమా అయితే చాలనుకునేవారు లేకపోలేదు. అంతటి పేరును సంపాదించుకున్నారు. శ్రీహరి సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే శాంతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
 
శాంతిని సినీ పరిశ్రమలో డిస్కో శాంతి అంటుంటారు. శాంతి అన్న దానికన్నా డిస్కో శాంతి అంటే ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. అనారోగ్య సమస్యలతో శ్రీహరి మరణించిన తరువాత ఎన్నో ఒడిదుడికులను ఎదుర్కొన్నారు ఆయన భార్య శాంతి. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే ఆలోచనలో ఉన్నారట. విషయం కాస్తా జనసేనాని పవన్ కళ్యాణ్‌ దృష్టికి వెళ్ళిందట. 
 
మొదట్లో డిస్కో శాంతినే స్వయంగా పవన్‌కు ఫోన్ చేసి ఆ తరువాత సైలెంట్ అయిపోయారట. కానీ ఇప్పుడు పవన్ స్వయంగా డిస్కో శాంతికి ఫోన్ చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట. ఇప్పటికే రెండుమూడుసార్లు పవనే ఆమెకు ఫోన్ చేసినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం శ్రీహరితో పవన్ కళ్యాణ్‌‌కు ఉన్న స్నేహ బంధమేనట. శ్రీహరిని సోదరుడిగా పవన్ కళ్యాణ్‌ భావించేవారట. ఆయన మరణించినప్పుడు పవన్ కళ్యాణ్‌ ఎంతో బాధపడ్డారట. దీంతో ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలనుకుని భావించినా డిస్కో శాంతి తీసుకోలేదట. 
 
అయితే ఏదో ఒక రూపంలో శ్రీహరి కుటుంబానికి సహాయం చేయాలన్నది పవన్ ఆలోచన. అందుకే శాంతికి ఫోన్ చేసి.. అమ్మా మీరు మన పార్టీలోకి రండి.. వేరే పార్టీ గురించి ఆలోచించడం మానేయండి.. మీరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మీకు మన పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారట. అయితే కాస్త సమయం కావాలని డిస్కో శాంతి పవన్‌ను అడిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

తీరం దాటేసిన మొంథా.. అయినా ముంచేసింది.. భారీ వర్షాలు.. ఏపీలో నలుగురు మృతి (video)

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments