Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ కళ్యాణ్ - క్రిష్ రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమా? (video)

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (22:13 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్తలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్‌లో న‌టించ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్ - టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ - దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 
వేణు శ్రీరామ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇదిలావుంటే... ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... క్రిష్‌తో ఓ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇది జాన‌ప‌ద చిత్రం. ఈ భారీ చిత్రాన్ని ఎ.ఎం.ర‌త్నం నిర్మించ‌నున్నారు. దీనిని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించాల‌నుకుంటున్నార‌ట‌. బాహుబ‌లి సినిమాలో ఉన్న‌ట్టుగా భారీ సెట్టింగులు ఇందులో ఉంటాయ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. 
 
ఎ.ఎం.ర‌త్నం ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించాలి అనుకుంటున్నార‌ని తెలిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ భారీ చిత్రానికి 100 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ట‌. ఇది ప‌వన్ కెరీర్లో భారీ బ‌డ్జెట్ మూవీ. హిందీ మిన‌హా మిగిలిన భాష‌ల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని టాక్ వినిపిస్తోంది.
 

సంబంధిత వార్తలు

హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలతను నెట్టేసిన మహిళ, ఎందుకు?- Video

లోకం మాధవి ఆస్తుల విలువ రూ.894 కోట్లు

మార్గదర్శి చిట్ ఫండ్‌కు వైకాపా నేత ఆర్కే రోజా లాయల్ కస్టమర్

సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు

కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments