Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో... పవన్ కళ్యాణ్, మహేష్ వస్తారా...?

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (18:24 IST)
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' స్పెయిన్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారాన్ని బట్టి ఈ చిత్ర ఆడియోను మార్చి 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారనీ, ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అటెండ్ అవుతారని అనుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత నటిస్తోంది.
 
ఇంకా ఆదాశర్మ, నిత్యామీనన్ నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా గతంలో బన్ని-త్రివిక్రమ్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే నిర్మాత కాంబినేషన్‌లో వీరు ముగ్గురి కలయికలో వస్తున్న సినిమా కావడంతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఆడియోతో పాటు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments