Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓం నమో వేంకటేశాయ...' హుండీలో అయితే వేస్తారు కానీ....

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం గురించి చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు బ్రహ్మాండంగా వుందని కితాబులిచ్చారు. రాజకీయనాయకులక్కూడా షోలు ప్రదర్శించారు. అద్భుతంగా నాగార్జున నటిస్తే.. దర్శకుడు అంతకంటే అద

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (16:33 IST)
అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం గురించి చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు బ్రహ్మాండంగా వుందని కితాబులిచ్చారు. రాజకీయనాయకులక్కూడా షోలు ప్రదర్శించారు. అద్భుతంగా నాగార్జున నటిస్తే.. దర్శకుడు అంతకంటే అద్భుతంగా తీశారంటూ కొనియాడారు. అయితే ఈ చిత్రంపై బయట డివైడ్‌ టాక్‌ వుంది. 
 
అన్నమయ్య, శ్రీరామదాసు కంటే ఏమీ బాగోలేదని కామెంట్లు విన్పిస్తున్నాయి. అందుకు తగినట్లుగా కలెక్షన్లు ఆ రేంజ్‌లో లేకపోవడం బయ్యర్లకు పెద్ద నిరాశను కల్గించిందని తెలుస్తోంది. రిలీజ్‌ అయి నాలుగు రోజులయినా.. రూ. 7.5 కోట్ల షేర్‌‌ను మాత్రమే రాబట్టగలిగింది. ఆ తరువాత వసూళ్లు నిలకడగానే వున్నాయి గానీ పెరగలేదు. 40 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ సినిమా, ఇదే స్థాయిలో కొనసాగితే మాత్రం బయ్యర్లకి నష్టాలు తప్పకపోవచ్చనే టాక్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌‌లో వినిపిస్తోంది. భక్తులు గోవిందుని హుండీలో అయితే వేస్తారు కానీ సినిమా టిక్కెట్లకు ఎందుకిస్తారూ... అని కొంతమంది దీర్ఘం తీస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments