Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ ఫోటోషూట్: కొత్త లుక్ అదురుతుందా?

Webdunia
మంగళవారం, 10 మే 2016 (12:03 IST)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ''జనతా గ్యారెజ్''. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
 
ఇంకా సాయికుమార్, సుహాసిని మణిరత్నం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ స్పెషల్ ఫోటోషూట్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఆయా సినిమాల పబ్లిసిటీ కోసం ప్రతి సినిమాకి హీరో హీరోయిన్లపై ఫోటో షూట్ చేయడం మనకి తెలిసిన విషయమే. ఇదే ట్రెండ్‌ని యంగ్ టైగర్ ఫాలో అవుతున్నాడట. 
 
ఈ  సినిమాకు సంబంధించిన పోస్టర్స్, లుక్స్ అన్నింటికీ ఈ షూట్‌‌కి సంబంధించిన స్టిల్స్‌నే వాడుకునేలా దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ నెల 20న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. అందుకోసం ప్రత్యేక ఫోటో షూట్‌ను నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రఖ్యాతిగాంచిన ఫోటోగ్రఫీ ఎక్స్‌పర్ట్స్‌తో త్వరలోనే ఈ ఫోటోషూట్ జరగనుందని మూవీ యూనిట్ సభ్యులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments