Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ మూవీలో నివేదా థామస్.. ఇది నిజమేనా? (video)

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (12:07 IST)
జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్. ఆ తర్వాత నిన్నుకోరి సినిమాతో మరో విజయం సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ మూవీ తర్వాత ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది నివేదా థామస్.
 
జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించింది. యూత్‌ని బాగా ఆకట్టుకుంది కానీ... ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 118, బ్రోచేవేరేవరురా, దర్బార్ సినిమాలతో మెప్పించినా.. స్టార్ హీరోల సినిమాలు అనుకున్నంతగా ఛాన్స్‌లు రాలేదు.
 
ఇదిలా ఉంటే... సూపర్ స్టార్ మహేష్‌ బాబు - గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో సర్కారు వారి పాట అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్‌ సరసన కీర్తి సురేష్‌ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఇందులో నివేదా థామస్ కూడా నటించనున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని... ఈ సినిమాతో నివేదాకు మరింత పేరు రావడం ఖాయం అంటున్నారు. ఇదే కనుక నిజమైతే... నివేదా థామస్‌కు బంపర్ ఆఫరే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments