Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సమంతను వద్దని చెప్పిన చైతూ..? ఎందుకు..?

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (19:02 IST)
''మజిలీ'' సినిమాతో మంచి విజయం అందుకొని భారీ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నాగచైతన్య సరసన నటిస్తుంది. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక మనం వంటి అద్భుతమైన సినిమా అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చైతూ ఒక సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. 
 
అలాగే ఈ సినిమాకు 'థాంక్యూ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మనం లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ రేంజి హిట్ మళ్లీ కొట్టలేదు విక్రమ్. నిజానికి హిట్ అనేదే ఆయనకు కరువైందని చెప్పాలి. కాబట్టి ఈ 'థాంక్యూ' సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది.
 
దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరినేది ఇంకా ఫైనల్ కాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది కానీ కాదని తేలింది. అయితే తాజాగా సమంత అయితే బాగుంటుందని మేకర్స్ సూచిస్తే.. నాగచైతన్య వెంటనే వద్దు అని చెప్పేసాడట.
 
ఎందుకంటే సామ్ - చైతూలు కలిసి రీసెంట్‌గా మజిలీ చేశారు. మళ్లీ అదే కాంబో అయితే బాగోదని చైతూ వేరే హీరోయిన్ని చూడమని చెప్పినట్లు సమాచారం. మరి ఈ సినిమాకు హీరోయిన్ ఎవరో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments