Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య సమంతను వద్దని చెప్పిన చైతూ..? ఎందుకు..?

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (19:02 IST)
''మజిలీ'' సినిమాతో మంచి విజయం అందుకొని భారీ గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నాగచైతన్య సరసన నటిస్తుంది. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక మనం వంటి అద్భుతమైన సినిమా అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో చైతూ ఒక సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. 
 
అలాగే ఈ సినిమాకు 'థాంక్యూ' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మనం లాంటి సూపర్ హిట్ తర్వాత ఆ రేంజి హిట్ మళ్లీ కొట్టలేదు విక్రమ్. నిజానికి హిట్ అనేదే ఆయనకు కరువైందని చెప్పాలి. కాబట్టి ఈ 'థాంక్యూ' సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది.
 
దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరినేది ఇంకా ఫైనల్ కాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది కానీ కాదని తేలింది. అయితే తాజాగా సమంత అయితే బాగుంటుందని మేకర్స్ సూచిస్తే.. నాగచైతన్య వెంటనే వద్దు అని చెప్పేసాడట.
 
ఎందుకంటే సామ్ - చైతూలు కలిసి రీసెంట్‌గా మజిలీ చేశారు. మళ్లీ అదే కాంబో అయితే బాగోదని చైతూ వేరే హీరోయిన్ని చూడమని చెప్పినట్లు సమాచారం. మరి ఈ సినిమాకు హీరోయిన్ ఎవరో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments