Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్‌కి జోడీగా 'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు... మణిరత్నం దర్శకత్వంలో....

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:26 IST)
తమిళంలో పేరుగాంచిన రైటర్ కల్కి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా, విజయ్, మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో సినిమా తీయాలని స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రయత్నించినప్పటికీ వర్క్అవుట్ కాలేదు.

తాజాగా ఈ సినిమా కోసం జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, మోహన్ బాబుతో మణిరత్నం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అరుల్ మోళి వర్మన్ పాత్రలో జయం రవి, ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్‌ను నటింపజేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ని కూడా నందిని పాత్ర కోసం ఎంపిక చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
 
ఈ నవలలో నందినిది చాలా కన్నింగ్ పాత్ర. పెరియా పళువెటరాయర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకుంటుంది. పెరియా పళువెటరాయర్‌ పాత్ర కోసం మోహన్ బాబును అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. క్యాస్టింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి ప్రకటించే అవకాశముంది. 
 
వరుస ప్లాపులతో తడబడిన మణిరత్నం గతేడాది తమిళంలో చేసిన ‘చిక్క చివంత వానమ్' సినిమా మంచి విజయం సాధించింది. ‘పొన్నియిన్ సెల్వన్' నవల రాయడానికి రచయితకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. మరి ఈ సినిమా పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

మా అమ్మకు కట్లపొడి, ఆకులు ఇష్టం.. ఉచిత బస్సులో వెళ్తున్నా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments