ఇటీవలే విడుదలైన 'ఆగడు', 'బ్రూస్ లీ' చిత్రాలు ఫ్లాప్ అవడంతో దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. ఇంతకుముందు ఆయనతో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరిన పెద్ద హీరోలు ఇప్పుడు ఆయనకు ముఖం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ఈ దర్శకుడుకి ఛాన్స్ ఇస్తున్నాడన్న వార్తలు ఫిలింనగర్లో చక్కెర్లుకొడుతున్నాయి. టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ శ్రీను వైట్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం అందరికి తెలిసిందే. గతంలో 'దూకుడు', 'ఆగడు' అనే చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కాయి.
శ్రీను వైట్ల తన తదుపరి చిత్రం మహేష్, యంగ్ హీరో సుధీర్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి మహేష్ హీరోగా కాకుండా నిర్మాతగా వ్యవహరించనున్నారు అనే విషయాన్ని సుధీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' చిత్రంతో బిజీగా ఉండగా సుధీర్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని తన ఎంటర్టైన్మెంట్ శైలిలోనే తెరకెక్కించి, తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి శ్రీను వైట్ల తెగ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పరాజయాలతో ప్రయాణం చేస్తున్న శ్రీను వైట్ల ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి.