Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ వార్తల్లో మహేష్ బాబు - పూరి సినిమా

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (14:46 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్... వీరిద్దరి కాంబినేషన్లో పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడం తెలిసిందే. అప్పటి నుంచి మహేష్‌ - పూరి కలిసి మూడవ సినిమా చేస్తే... చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
 
అయితే... పూరి మహేష్ బాబుకి కథ చెప్పినప్పటికీ.. మహేష్‌ ఎటూ తేల్చడం లేదని గతంలో పూరి మీడియాకి చెప్పడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇలా పూరి మహేష్ గురించి చెప్పడంతో ఇక మహేష్ బాబుతో పూరి సినిమా లేనట్టే అనుకున్నారు.
 
దీంతో పూరి మహేష్‌ బాబుతో తీయాలనుకున్న జనగణమన చిత్రాన్ని వెంకీతో తీయాలి అనుకున్నారు. కథ చెప్పడం.. వెంకీకి నచ్చడం జరిగింది కానీ ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువవుతుంది. వెంకీతో భారీ బడ్జెట్‌తో మూవీ చేస్తే వర్కవుట్ కాదేమో అనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత పూరి కన్నడ రాక్ స్టార్ యాష్‌‌తో జనగణమన సినిమా తీయనున్నట్టు వార్తలు వచ్చాయి.
 
కేజీఎఫ్ 2 తర్వాత యాష్ పూరితో జనగణమన తీయనున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ... మహేష్ పూరి కలిసి సినిమా చేయాలనుకుంటున్నారని.. త్వరలో మహేష్ బాబుకి పూరి కథ చెప్పేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments