Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అలా చెప్పలేదు.. తప్పుడు వార్తలు రాయొద్దు.. కైరా అద్వానీ

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (19:10 IST)
పారితోషికం తక్కువగా ఇస్తుండటం వల్లే తెలుగు చిత్రాల్లో నటించడం లేదంటూ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి కైరా అద్వానీ స్పందించారు. తాను ఎన్నడు కూడా అలా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. పైగా, సరైన కథలు లేకే తాను తెలుగులో నటించడం లేదని తెలిపారు.
 
"భరత్ అనే నేను" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ కైరా అద్వానీ. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కైరా అద్వాని, ఆ తర్వాత 'వినయ విధేయరామ' చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి కైరా తెలుగు సినిమాలు చేయడం లేదు.
 
అదేసమయంలో తెలుగు నుంచి ఆఫర్స్ వెళితే భారీగా పారితోషికం అడుగుతోందనే వార్తలు వచ్చాయి. తాను అడిగిన దానికి తక్కువగా పారితోషికం ఇస్తే చేయనని నిర్మొహమాటంగా చెబుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
దీనిపై కైరా స్పందిస్తూ, "తెలుగు నుంచి నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే నేను తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాను. తెలుగులో కథ.. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలనే నిర్ణయంతో వున్నాను. అంతేగానీ పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు" అని వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments