Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకి పబ్లిసిటీ పిచ్చి... కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కువ : కమల్ హాసన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఇటీవల రజనీకాంత్ తన అభిమానులతో మూడు రోజుల పాటు ఫోటోలు దిగిన విషయం తెల్సిం

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (14:04 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఇటీవల రజనీకాంత్ తన అభిమానులతో మూడు రోజుల పాటు ఫోటోలు దిగిన విషయం తెల్సిందే. దీంతో ఆయన రజకీయ రంగ ప్రవేశం చేసేందుకే ఇలా చేశారంటూ వార్తలు గప్పుమన్నాయి. 
 
ఈ వార్తలపై కమల్ హాసన్ స్పందిస్తూ రజనీకాంత్ కు కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కువ అన్నారు. అందుకే ఇలా హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్ ప్రత్యక్ష మవుతారన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపుతున్నాయి.
 
నిజానికి తమిళ సినీ ఇండస్ట్రీకి వీరిద్దరు రెండు నేత్రాలుగా ఉన్నారు. పైగా, ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులుగానూ, స్టార్ హీరోలుగా పేరుతెచ్చుకున్నారు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా ప్రత్యక్ష విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా రజనీపై కమల సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేగుతోంది. 
 
ఇదిలావుండగా, ఇటీవల ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూడా రజనీకాంత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రాన్ని తమిళుడే పాలించాలంటూ వ్యాఖ్యానించారు. అంటే రజనీకాంత్ తమిళుడు కాదని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments