పారిస్లోని ''లీ గ్రాండ్ రెక్స్''లో కబాలి సినిమా ప్రీమియర్ షో.. దటీజ్ రజినీకాంత్!
రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కబాలి' సినిమా రికార్డ్లు బద్దలు కొడుతూనే ఉంది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం టీజర్కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది.
రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కబాలి' సినిమా రికార్డ్లు బద్దలు కొడుతూనే ఉంది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం టీజర్కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని సరసన రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తోంది. కలైపులి ఎస్ థాను ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 'లింగా', 'కొచ్చైడైయాన్' పరాజయం తర్వాత రజిని నటిస్తున్న చిత్రం కావడంతో కబాలి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే 'కబాలి' సినిమాకు యూరప్ దేశంలో ఓ అరుదైన గౌరవం దక్కింది. యూరప్ దేశాల్లోకెళ్లా అతిపెద్ద థియేటర్ పారిస్లోని ''లీ గ్రాండ్ రెక్స్''లో కబాలి సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు.
దాదాపు రెండు వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న అతిపెద్ద థియేటర్లో ఓ భారతీయ సినిమాను ప్రీమియర్ షో వేయడంతో రజినీకున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రజినీకాంత్కు భారత్లోనే కాకుండా, యూఎస్, జపాన్, యూకే లాంటి దేశాల్లో సైతం అభిమానులు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు భారీగా ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఓవర్సీస్లో రజినీ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక జూలై 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున 'కబాలి' సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.