''టెంపర్'', ''నాన్నకు ప్రేమతో'' లాంటి వరుస హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ''శ్రీమంతుడు'' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన కొరటాల శివ దర్వకత్వం
''టెంపర్'', ''నాన్నకు ప్రేమతో'' వంటి వరుస హిట్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ''శ్రీమంతుడు'' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అంతేకాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ ఐటెం సాంగ్ కూడా చేసింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళంలోనే భారీగా రిలీజ్ చేస్తున్నారు. మనదేశంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో అత్యధికంగా 48కి పైగా ప్రదేశాల్లో జనతా గ్యారేజ్ చిత్రం రిలీజ్ అవుతోంది.
ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా గల్ఫ్ దేశాల్లో ఇన్ని ప్రదేశాల్లో స్క్రీనింగ్ కాలేదు.. మొట్టమొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' ఆ రికార్డ్ని దక్కించుకోవడం విశేషం. సెప్టెంబర్ 1వ తేదీన పపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా దానికి ఒకరోజు ముందుగానే గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది.