మ‌హేష్ మ‌హ‌ర్షి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్..!

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (14:08 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హ‌గ్డే న‌టిస్తుంటే... కీల‌క పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రంలో మాత్రం మహేష్ మరోసారి తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు అని తెలుస్తుంది.
 
ఎందుకంటే ఈ చిత్రంలో మహేష్ మూడు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు అని సమాచారం. బిజినెస్ మ్యాన్‌గా, స్టూడెంట్‌గా మరియు మరో ముఖ్య పాత్ర ఒక సాధారణ రైతుగా కనిపించబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే మ‌హేష్ అభిమానుల‌కు పండ‌గే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments