Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ ఓ మెంటల్‌గాడు... 'మా' అధ్యక్షుడు శివాజీరాజా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒకరుకాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ ఆయన వ్యాఖ్యా

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (14:50 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒకరుకాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. 
 
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో పలువురు సినీ ప్రముఖులను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు పిలిచి విచారించిన విషయంతెల్సిందే. అయితే, ఈ విషయంలో సిట్ చీఫ్ అకున్ సభర్వాల్‌ను అందరూ బాహుబలితో పోలుస్తున్నారని, ఆయనతో రాజమౌళి బాహుబలి-3 సినిమా తీయాలని రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. దీంతో డ్రగ్స్ కేసు వ్యవహారం ఒక్కసారి వేడెక్కింది. 
 
పోలీస్ అధికారుల్ని రెచ్చగొట్టడం మనకే మంచిదికాదంటూ మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీ రాజా అప్పట్లో వర్మకు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ ఆర్జీవీ తీరుమార్చుకోలేదు. అదేసమయంలో తెలుగు చిత్రసీమలో కొన్ని డ్రగ్స్ పురుగులు ఉన్నమాట వాస్తవమేనని, వాళ్లను మేమేదారిలో పెట్టుకుంటామని, ఇంతవరకూ జరిగిన సంఘటనలకు పరిశ్రమ బాధపడుతోందని తెలంగాణ ప్రభుత్వానికి మూవీ ఆర్టిస్టుల సంఘం, ఫిలిం ఛాంబర్ సంయుక్తంగా రాసింది. 
 
ఈ లేఖ మీద కూడా రాంగోపాల్ వర్మ అప్పుడే తీవ్రంగా స్పందించారు. ఈ లేఖ ద్వారా తాము చెయ్యని తప్పును ఒప్పుకున్నట్లయిందని, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని వర్మ సోషల్ మీడియాలో కామెంటరీ ఇచ్చేశారు. దీంతో మూవీ ఆర్టిస్టుల సంఘం వర్మను ఎట్టిపరిస్థిల్లోనూ ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒక్కరు కాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ మా అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments