Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

సెల్వి
సోమవారం, 9 జూన్ 2025 (12:14 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరువు తీసింది యాంకర్ ఉదయభాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అనేక అడ్డంకులు పడుతూ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 12న విడుదలని చెప్పి ఆ విడుదల తేదీని కూడా వాయిదా వేసేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 
 
అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకి డైరెక్టర్‌గా పనిచేసిన జ్యోతి కృష్ణ ఓ ప్రైవేట్ ఈవెంట్ పెట్టారు. ఈ సినిమాలోని ఒక పాట పవన్ కళ్యాణ్‌కి చాలా ఇష్టం. ఆ పాట ఆయన దాదాపు 500 సార్ల వరకు చూసి ఉంటారు.. అంటూ లైవ్ లోనే ఆ పాటని ప్లే చేయించారు.
 
దీనిపై ఉదయభాను పవన్ కళ్యాణ్ పరువు గంగలో కలిపేసింది. ఎందుకంటే పాట ప్లే చేస్తుండగా మధ్యలోకి వచ్చి పవన్ కళ్యాణ్ 500 సార్లు ఆ పాటను చూశారంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పాట పాడే ఉంటారు. ఆ రహస్యాన్ని మీరు దాచేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాడిన ఆ పాట ఏంటో మీరు చెప్పాల్సిందే అంటూ మాట్లాడింది. 
 
కానీ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ మాట వినాలి అనే పాట పాడారు. ఈ పాట కూడా ఎప్పుడో విడుదలైంది. అయితే అలా విడుదలైన విషయం కూడా ఉదయభానుకి తెలియకపోవడం నిజంగా పవన్ కళ్యాణ్‌కి ఆయన అభిమానులకి అవమానమే అంటున్నారు చాలామంది ఈ వీడియో చూసిన నెటిజన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments