ఛార్మీపై చేయి వేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్.. అసహనంతో సిట్ అధికారులతో ఫిర్యాదు

కారు దిగి సిట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్ తనపై చేయి వేశాడని సిట్ అధికారులతో ఆమె ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో ఛార్మి బుధవారం విచారణకు హాజరైంది. ఆమె సిట్ కార్యాలయానికి వచ్చినప

Webdunia
బుధవారం, 26 జులై 2017 (14:07 IST)
కారు దిగి సిట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్ తనపై చేయి వేశాడని సిట్ అధికారులతో ఆమె ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో ఛార్మి బుధవారం విచారణకు హాజరైంది. ఆమె సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు పోలీసుల్ చేసిన హైడ్రామాపై సిట్ అధికారులకు ఛార్మీ ఫిర్యాదు చేసింది.
 
చార్మీ కారు దిగి కార్యాలయం లోపలికి వచ్చే సమయంలో అక్కడున్న పోలీసులు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అక్కడ మహిళా పోలీసులు ఉన్నప్పటికీ శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ చార్మిపై చేయి వేశాడు. దీనిపై అప్పుడే చార్మి కాస్త అసహనం వ్యక్తం చేసింది. 
 
అనంతరం ఐదో అంతస్తులోకి వెళ్లి విచారణకు హాజరైన చార్మి తొలుత ఈ విషయాన్నే ప్రస్తావించినట్లు సమాచారం. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ తనపై చేయివేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపడతామని సిట్ అధికారులు చార్మికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
 
మరోవైపు డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛార్మీని సిట్ అధికారులు విచారిస్తున్నారు. చార్మి, కెల్విన్‌ మధ్య వెయ్యికి పైగా వాట్సప్‌ కన్వర్జేషన్స్‌ జరిగినట్లు సమాచారం. కెల్విన్‌ ఫోన్‌లో చార్మి దాదా పేరుతో ఫోన్‌ నెంబర్‌ ఉన్నట్లు తెలిసింది.

జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్‌లో కెల్విన్‌తో కలిసి చార్మి ఫొటోలు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసిస్టెంట్ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత ఛార్మిని ఇంటరాగేట్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు సిట్ అధికారులు ఛార్మీని విచారించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments