Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ 150వ చిత్రంలో పంజాబీ సింగర్.. మ్యూజికల్ హిట్ కోసం డీఎస్పీ తంటాలు

చిరంజీవి 150 వ చిత్ర టైటిల్‌ను నిర్మాత, హీరో రామ్ చరణ్ ఖరారు చేసింది. చిరంజీవి 150 వ చిత్రం పేరు 'ఖైదీ నెంబర్ 150' గా ఖరారు చేశారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి వి.వి.వినాయక్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (12:23 IST)
చిరంజీవి 150 వ చిత్ర టైటిల్‌ను నిర్మాత, హీరో రామ్ చరణ్ ఖరారు చేసింది. చిరంజీవి 150 వ చిత్రం పేరు 'ఖైదీ నెంబర్ 150' గా ఖరారు చేశారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఆయనకే కాదు, ఆ చిత్రానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. అందుకే, ఎవరికి వారు తమ సత్తా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన దైన శైలిలో ఈ చిత్రానికి సంగీతాన్నిఅందిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ పేరు వినగానే ఎనర్జిటిక్ పాటలు గుర్తొస్తాయి. కేవలం గుర్తుకు రావడమే కాదు దేవి పాటలు వింటే ఎవ్వరైనా డాన్స్ వేసేయ్యాల్సిందే. 
 
ముఖ్యంగా దేవి ఐటెం సాంగ్ అంటే చెవులు కోసుకునే వారు కుడా వున్నారనే చెప్పాలి. ఎన్నో మాస్ సినిమాలకు దేవి పాటలు ఆర్ ఆర్ ప్లస్ అయ్యాయనే చెప్పాలి. అంతేకాదు దేవి సంగీతం అంటే సినిమాకు ముందే సగం విజయం కూడా అందుకున్నట్లే. చిరంజీవి సినిమా అంటే మ్యూజికల్ హిట్‌గా ఉండాలి కాబట్టి క్యాచీ నంబర్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉత్తరాదికి చెందిన పేరున్న సింగర్స్ చేత పాడిస్తున్నాడు. అలాగే ప్రముఖ పంజాబీ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ చేత కూడా తాజాగా ఓ పాట పాడించాడు. 
 
ఈ విషయాన్నిసింగర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 'మెగాస్టార్ సినిమా కోసం డీఎస్పీ వద్ద నా తొలి తెలుగు సాంగును రికార్డు చేశాను. చాలా అదృష్టవంతురాలిని' అంటూ ట్వీట్ చేయడమే కాకుండా, దేవిశ్రీతో కలసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది. జాస్మిన్ పలు ఆల్బమ్స్ తో పాప్యులర్ కావడమే కాకుండా, పలు హిందీ సినిమాలలో కూడా పాడుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ స్వయగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments