Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా కలెక్షన్లపై తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వను : దిల్ రాజు

మెగా అభిమానులకు, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వుడ జగన్నాథమ్". ఈ చిత్రం గత

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (15:52 IST)
మెగా అభిమానులకు, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వుడ జగన్నాథమ్". ఈ చిత్రం గత నెల 24వ తేదీన విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టింది. 
 
అయితే, ఈ చిత్రం కలెక్షన్లు మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150"ను దాటిపోయిందనే ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహించిన చిరంజీవి ఫ్యాన్స్ డీజే కార్యాలయంపై దాడికి దిగారు. ఈ ఘటన ఫిల్మ్ నగర్‌లో సంచలనం సృష్టించింది. దీనిపై దిల్ రాజు స్పందించారు. 
 
అల్లు అర్జున్ కెరీర్‌‌లో 'సరైనోడు' చిత్రం కలెక్షన్లే ఇప్పటివరకూ అధికమని, దాన్ని దాటిన తర్వాతనే 'డీజే-దువ్వాడ జగన్నాథం' చిత్రం హిట్ అని తాను ప్రకటించానని చెప్పారు. అలాగే, తాను ఎన్నడూ తప్పుడు మాటలు చెప్పలేదని, రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.
 
తమది నమ్మకమైన బ్యానర్ అని, అటువంటి సంస్థ ఓ చిత్రాన్ని హిట్ అని చెప్పిన తర్వాత తప్పులు వెతకడం ఎందుకని ప్రశ్నించారు. ఓ హీరోకు ఇటువంటి సమస్య వస్తే, ఆ హీరో అభిమానుల నుంచి మరో హీరో చిత్రం వచ్చినప్పుడూ ఇదే సమస్య వస్తుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ తరహా విష సంస్కృతిని పెంచకుండా హీరోలు తమ తమ అభిమానులను కట్టడి చేయాలని ఆయన కోరారు.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments