సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్కు తెలుగులో ప్రముఖ హీరోలంతా కావాలని కోరుకుంటారు. ఆయన సంగీతం క్రేజ్ తెప్సిస్తుందనీ, యువతను ఉర్రూతలూగిస్తుందని అంటారు. ఇటీవలే తమిళ నటుడు విజయ్ 'పులి'లో పాటలను బాగా కంపోజ్ చేశాడనే పేరు పొందాడు. తెలుగులో పవన్తో, అల్లు అర్జున్తో సినిమాలు చేశాడు.
జల్సా, అత్తారింటికి... సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు ఆయన చేసినవే. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా నితిన్తో ఓ సినిమా చేస్తున్నాడు. దానికి దేవీశ్రీ ప్రసాద్ను తీసుకుంటారని భావించారు. కానీ అతని స్థానంలో అనిరుథ్ను ఎంపిక చేసినట్లు తెలిసింది.
దీనికి కారణం.. నితిన్ సినిమాలంటే.. మెలోడీకి ప్రాధాన్యత ఇస్తూ చిత్రాలు వుంటాయి. ఈసారి మాత్రం దేవీశ్రీని అనుకున్నా... ఆయన ఇతర భాషల్లో బిజీగా వుండటంతో కుదరదని చెప్పడంతో మార్చినట్లు సమాచారం. చిత్ర నిర్మాత రాధాకృష్ణ.. అనిరుథ్తో చర్చించి ఒప్పించినట్లు సమాచారం.