ఒక్కో నిమిషానికి రూ.33 లక్షలిస్తే వస్తా... ఆ తర్వాత చూపిస్తా నా తఢాకా అంటున్న నాయికలు
బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపిక పదుకునేలు బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా తమ సత్తాని చాటుకుంటున్నారు. దీంతో వీరిద్దరి పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ పాపులారిటీని ఇద్దరు భామల
బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపిక పదుకునేలు బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా తమ సత్తాని చాటుకుంటున్నారు. దీంతో వీరిద్దరి పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ పాపులారిటీని ఇద్దరు భామలు క్యాష్గా చేసుకుంటున్నారు. ఒక అవార్డు వేడుకలో వీరితో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయించడానికి నిర్వాహకులు భారీ మొత్తంలో చెల్లించనున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఈసారి స్పెయిన్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
ఇలాంటి ఈవెంట్స్లో భారీ మొత్తం చెల్లించి బాలీవుడ్ తారలతో స్పెషల్ డ్యాన్స్లను చేయించడం నిర్వాహకులకు అలవాటే. ఇందుకోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎంత డిమాండ్ చేస్తే అంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తారు. అక్కడి ప్రజలు ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనేలను చూసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారట. దాంతో ఎలాగైనా వీరిచేత డాన్స్ చేయించాలని నిర్వాహకులు డిసైడ్ అయిపోయారట. దీంతో నిర్వాహకులు వారిని సంప్రదిస్తే దిమ్మదిరిగే పారితోషికం కావాలని తేల్చి చెప్పేశారట.
ఈ ఈవెంట్లో దీపిక పదుకొనే ఒక్కో నిమిషానికి 33 లక్షల చొప్పున పేమెంట్ ఇస్తే డాన్స్ చేస్తానని ఖరాఖండిగా చెప్పిందట. దాంతో ఒక్క పాటకు 1.32 కోట్ల రూపాయలు మొత్తం చెల్లించేందుకు నిర్వాహకులు ఒకే చెప్పారట. మరోవైపు ప్రియాంక చోప్రా కూడా సేమ్ టూ సేమ్ ఇంతే మొత్తాన్ని డిమాండ్ చేసిందట.
దీనికి తగ్గట్లుగా బాలీవుడ్ అవార్డ్స్ షో నిర్వాహకులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఎంత మొత్తం ఇవ్వడానికైనా రెఢీ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం. మన బాలీవుడ్ హీరోలు కూడా వాళ్లకి తీసిపోని విధంగా భారీ మొత్తాన్నితీసుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రదర్శనలకు గాను సల్మాన్ ఖాన్ రూ.5 కోట్లు.. హృతిక్ రోషన్ రూ.4 కోట్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం.