Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒసేయ్...రాములమ్మ'గా మంచు లక్ష్మి...దాసరి దర్శకత్వంలో

ప్రస్తుతం ఎక్కడ చూసినా... ఇప్పుడంతా రీమేక్స్, సీక్వెల్స్ మీద పడుతున్నారు. వాటికి ప్రేక్షకాదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ దిశగా తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బాటలోకి ప్రముఖ దర్శకుడు దాసరి

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (15:17 IST)
ప్రస్తుతం ఎక్కడ చూసినా... ఇప్పుడంతా రీమేక్స్, సీక్వెల్స్ మీద పడుతున్నారు. వాటికి ప్రేక్షకాదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ దిశగా తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బాటలోకి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కూడా వస్తున్నట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
గతంలో ఆయన విజయశాంతిని ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించిన 'ఒసేయ్...రాములమ్మ' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసే యోచన చేస్తున్నారట. అప్పట్లో 'ఒసేయ్...రాములమ్మా' సినిమా సంచలన విజయం సాధించి, విజయశాంతి ఇమేజ్‌ను ఎన్నో రెట్లు పెంచింది. ఈ కథకు కొనసాగింపుగా 'రామసక్కని తల్లి' పేరుతో దాసరి అద్భుతమైన కథను తయారుచేసుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఇటీవల మంచు లక్ష్మి నటించిన ''లక్ష్మీ బాంబ్ '' చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు లక్ష్మిలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు తెలియదు... లక్ష్మీ బాంబ్ ట్రైలర్ చూసాక ''ఒసేయ్ రాములమ్మ'' సీక్వెల్ లక్ష్మి మంచుతో చేయాలనీ ఉందని అన్నాడు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఒసేయ్ రాములమ్మా తెలుగు చలన చిత్ర చరిత్రలోనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరి ఈ సీక్వెల్ లో నటించడానికి లక్ష్మి ఒప్పకుంటుందో లేదో వేచి చూడాలి. 

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments