Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి ఆరోగ్యం ఆందోళనకరమా?.. కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఆరోగ్యం బాగా క్షీణించినట్టు సమాచారం. దీంతో ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈనెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (17:40 IST)
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఆరోగ్యం బాగా క్షీణించినట్టు సమాచారం. దీంతో ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈనెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆయన.. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే, మంగళవారం దాసరి ఆరోగ్యం ఉన్నట్టు బాగా క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, గ‌డిచిన ఐదు నెల‌ల్లో దాస‌రి నారాయ‌ణ రావు ఇప్ప‌టికే 2, 3 సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవ‌ల ఆయన త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల స‌మ‌యంలో కూడా ఉత్సాహంగానే క‌నిపించారు. అయితే, దాసరి మ‌ళ్లీ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న‌కు ఆసుప‌త్రిలో డ‌యాల‌సిస్ అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు తెలిసింది.
 
ఆయ‌న‌కు ఇప్ప‌టికే వైద్యులు ప‌లు స‌ర్జరీలు చేశారు. ఆయ‌న‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం మరోమారు ఆయనకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్టు సమాచారం. అయితే, దాసరి ఆరోగ్యం ఎలా ఉందన్న విషయంపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు మెడికల్ బులిటెన్‌ను విడుదల చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments