Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ నిజాలు... ఇంటర్నేషనల్ సిమ్‌తో పూరీ చాటింగ్ ‌.. డ్రగ్ సరఫరాకర్త శ్యామ్?

హైదరాబాద్ డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు తక్కువోడేంకాదనీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అంటున్నారు. మత్తుమందు కొనుగో

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (15:01 IST)
హైదరాబాద్ డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు తక్కువోడేంకాదనీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అంటున్నారు. మత్తుమందు కొనుగోలు కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ సిమ్ ఒకదాన్ని వాడుతున్నట్టు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ సిమ్ ద్వారా వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి ఆ గ్రూపు సభ్యుల ద్వారా మత్తుమందును విక్రయిస్తున్నారనే విషయాన్ని నిర్ధారించినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా పూరీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా గంటల తరబడి చాట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై పూరీని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్న ఈ దర్శకుడు... సిమ్ నంబరుతో పాటు చాట్ వివరాలు చూపించే సరికి తప్పు అంగీకరించినట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి పూరీ జగన్నాథ్ కెల్విన్‌తో గంటల తరబడి చాట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. 
 
ఆ సిమ్ ద్వారా గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్టు, దాని ద్వారా డ్రగ్స్ అమ్మకాలు సాగించినట్టు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ దందా మొత్తం బట్టబయలైనట్టు సమాచారం. అయితే విదేశాల నుంచి వచ్చే పార్సిల్స్‌ను పూరీకి అందించానే తప్ప, అందులో ఏముందో కూడా తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, పూరీకి డ్రగ్స్ చేరవేసేది శ్యామ్ కె నాయుడేనని సిట్ అధికారులు నిర్ధారించినట్టు సమాచారం. 
 
సిట్ అధికారుల దర్యాప్తులో డ్రగ్స్ దందా పేరుతో తన తండ్రిని బద్నాం చేస్తున్నారంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమార్తె ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా చెప్పిన నీతులు, తనకు సిగిరెట్ అలవాటే లేదు... ఇక డ్రగ్స్ అంటే ఏమిటో కూడా రుచి చూడలేదు, అసలు ఎప్పుడూ చూడనే లేదంటూ మీడియా ముందు శ్యామ్ కే నాయుడు చెప్పిన కథలు అంతా అబద్ధాలని తెలిపోయాయి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments