Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గౌతమీపుత్ర శాతకర్ణి'' చిత్రం కోసం బాలీవుడ్ నటీనటులపై కన్నేసిన బాలయ్య!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:21 IST)
బాలకృష్ణ వందో సినిమాపై వెలువడుతున్నవార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. బాలయ్య వందో సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ''గౌతమీపుత్ర శాతకర్ణి'' కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ తెరకెక్కించనున్న ఈ చారిత్రక సినిమాలో నటీనటులతో పాటు, సాంకేతికంగానూ ఈ సినిమాని వైవిధ్యభరితంగా చూపేందుకు దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 
 
అందులో భాగంగానే బాలీవుడ్ నటి హేమ మాలినిని తల్లి పాత్రకు ఎంపిక చేశాడు. అలాగే దర్శకుడు క్రిష్ బాలకృష్ణలు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం క్రిష్ ఈ చిత్రంలో నటీనటులను చాలా వరకు బాలీవుడ్ వాళ్ళని తీసుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. 
 
బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న క్రిష్ ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న చిత్రంతో అక్కడ కూడా క్యాష్ చేసుకొనే ఆలోచనలో ఉన్నాడట. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యుల్‌ని మొరాకోలో నెల రోజుల పాటు చేసేందుకు యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments