Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేజర్ ద్వారా ధనుష్ పుట్టుమచ్చల్ని చెరిపేశాడా? డీఎన్ఏ టెస్టుకు రెడీ కావాల్సిందేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు తల్లిదండ్రులు మేమేనని చెప్పుకుంటూ మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తాను కస్తూరి రాజా

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (18:49 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు తల్లిదండ్రులు మేమేనని చెప్పుకుంటూ మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తాను కస్తూరి రాజా పుత్రుడినా.. కదిరేశన్ కుమారుడినా అని నిరూపించుకునేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ కేసును కొట్టిపారేయాలని ధనుష్ తరపున పిటిషన్ కూడా దాఖలైంది. 
 
అయితే ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ధనుష్ తాను కస్తూరి రాజా కుమారుడైతే.. ఎందుకు సమయం కావాలని కోరాడని ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అంతేగాకుండా.. ఈ కేసుకు సంబంధించిన కీలక మెడికల్ రిపోర్టులో ధనుష్ తన శరీరంపై గల మచ్చలను లేజర్ ద్వారా తొలగించినట్లు సమాచారం. ధనుష్ తన శరీరంపై గల మచ్చల్ని ఇలా లేజర్ ద్వారా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న తలెత్తింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఈ కేసు విచారణకు రానుంది. ఈ సందర్భంగా కదిరేశన్-మీనాక్షి దంపతులు ధనుష్‌కు డీఎన్ఏ పరిశోధన చేయాలని కోర్టును కోరనున్నట్లు తెలిసింది. ఈ టెస్టులో ధనుష్ తమ కుమారుడేనని తేలిపోతుందని కదిరేశన్ దంపతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments