ఒకప్పటి హీరోయిన్గా, ఆ తర్వాత రాజకీయనాయకురాలిగా సినీనటి రోజా అందరికి సుపరిచితమే. వీటన్నిటి కంటే టీవీ షో ల్లో చాలా పాపులర్ అయింది. ''జబర్దస్త్'' షో ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసింది. జబర్దస్త్ అంటే తెల
ఒకప్పటి హీరోయిన్గా, ఆ తర్వాత రాజకీయనాయకురాలిగా సినీనటి రోజా అందరికి సుపరిచితమే. వీటన్నిటి కంటే టీవీ షో ల్లో చాలా పాపులర్ అయింది. ''జబర్దస్త్'' షో ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసింది. జబర్దస్త్ అంటే తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి లేదేమో. ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రోజా, నాగబాబుకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కానీ ఉన్నట్టుండి ఏమైందో కాని రోజా జబర్దస్త్లో ఈ మధ్య మాయమైంది. ఆమె స్థానంలో మంచు లక్ష్మి ప్రత్యక్షమైంది. ఈ షో అనంతరం రోజా 'రచ్చబండ' అనే ప్రోగ్రామ్ని చేస్తోంది.
ఇప్పటికే ఆ షోలో హోస్ట్గా చేసిన సుమలత, జీవిత రాజశేఖర్ మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే రోజా కూడా ఈ షోపై మొగ్గుచూపించింది. కానీ ఈ మధ్య ఆ షోలో రోజా ఓవరాక్షన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. నాలుగు గోడల మధ్య జరగాల్సిన గొడవను, షో పేరుతో నాలుగు కోట్ల మంది చూసేలా వాళ్ల పరువును రోడ్డుకు తెప్పిస్తున్నారు.
ఈ షో ఎంత దారుణం అంటే టీ.ఆర్.పి రేటింగ్స్ కోసం గొడవలను కూడా ఎంటర్టైన్మెంట్ కింద చిత్రీకరిస్తున్నారు. నిజంగా ఈ షోస్ ద్వారా కాపురాలని చక్కబెడుతున్నారన్న విషయాన్ని పక్కన పెడితే ఒక ఇంటి పరువును బజారుకీడుస్తున్నారనే విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదిలావుంటే..రోజా రచ్చబండ షో పై ఒక కామెడీ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమో చూసిన వారందరు నిజంగా ఇలాంటి షోస్ వెనుక ఇంత డ్రామా వుంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు.