Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్ళ తరువాత బాలయ్యతో వినాయక్...

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (16:54 IST)
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాల తరువాత ఒక అగ్ర దర్శకుడు, ఒక అగ్రహీరో కలవబోతున్నారు. వారెవరో కాదు సంచలన దర్శకుడిగా పేరొందిన వినాయక్, బాలక్రిష్ణ. ఆది సినిమాతో దర్సకుడిగా మారి ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు తీసిన వినాయక్ బాలక్రిష్ణతో ఒకే ఒక్క సినిమా తీశారు. అదే చెన్నకేశవరెడ్డి. అప్పట్లో ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. కానీ వీరి కాంబినేషన్ మాత్రం బాగుందని ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు.
 
ప్రస్తుతం బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా వున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో పూర్తవుతుంది. ఈ సినిమా తరువాత బాలక్రిష్ణ బోయపాటికి అవకాశమిస్తారని, వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ అది జరుగలేదు. వినాయక్‌తో కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట బాలక్రిష్ణ. 
 
గత రెండు రోజుల క్రితం బాలక్రిష్ణ స్వయంగా వినాయక్‌కు ఫోన్ చేసి కథను సిద్ధం చేయమని చెప్పాడట. దీంతో వినాయక్ ఒక మంచి కథను సిద్థం చేస్తున్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments