సమంతకు భర్తగా అర్జున్ రెడ్డి.. మరి షాలిని పాండే సంగతేంటి?

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేం నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ను సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలోరూపొ

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (13:04 IST)
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేం నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ను సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలోరూపొందుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
 
సావిత్రి చిత్రంలో సమంత, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో ‘అర్జున్‌ రెడ్డి’ చిత్ర కథానాయిక షాలిని పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు ‘అర్జున్‌ రెడ్డి’లో షాలిని నటన నచ్చేయడంతో సావిత్రిలో ఛాన్స్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో సావిత్రి భర్త, అలనాటి కథానాయకుడు జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
 
అంతేకాదండోయ్.. ఇక‌ అర్జున్ రెడ్డి చిత్రంతో బాగా పాపులర్ అయిన‌ విజయ్ దేవరకొండ.. సమంతకి భర్తగా ఇందులో కనిపించనున్నాడని టాక్ వస్తోంది. ఇదే సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్‌గా న‌టించిన షాలిని పాండే కూడా కీలక పాత్రకు ఎంపిక అయ్యిందని జోరుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments