ఆ దర్సకుడితో రంగమ్మత్తకు చెడిందా? (Video)

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:48 IST)
బుల్లితెరమీదే కాదు వెండితెర మీద కూడా వెలుగొందుతోంది అనసూయ. జబర్దస్త్ తోనే ఆమెలోని టాలెంట్ బయటకు వచ్చింది. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
 
కరోనా సమయంలోను తన అభిమానులతో ఛాటింగ్ చేస్తూ సేఫ్ హోమ్ అంటూ చెబుతూ వచ్చింది. అయితే రంగమ్మత్తకు దర్సకుడు క్రిష్ణవంశీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. రంగమార్తాండ సినిమాలో రంగమ్మత్తుకు అవకాశం వచ్చింది.
 
అది కూడా కరోనాకు ముందే ఆమెకు ఈ అవకాశం లభించింది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యక్రిష్ణలవి కీలక పాత్రలైతే అనసూయ పాత్ర కూడా కీలకమేనట. మరాఠీలో సూపర్ హిట్ అయిన సినిమా ఆధారంగా రంగమార్తాండ సినిమా తెరకెక్కుతోంది.
 
కరోనా పుణ్యమా అని రెండునెలల పాటు షూటింగ్ నిలిచిపోతే తెలంగాణా ప్రభుత్వ అనుమతితో ప్రస్తుతం మళ్ళీ షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. అయితే షూటింగ్ లకు అనసూయ కూడా రెగ్యులర్ కూడా హాజరవుతోందట.
 
కానీ షూటింగ్ సమయానికి సరిగ్గా రాకపోవడం.. ఆలస్యంగా ఆమె రావడంతో దర్సకుడు క్రిష్ణవంశీతో వాగ్వాదం కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఒకవైపు జబర్దస్త్ మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉండడం వల్ల ఆమెకు సమయం సరిపోవడం లేదట.
 
రంగమార్తాండలో అనసూయకు ఇచ్చిన క్యారెక్టర్ ఆమెకు కరెక్టుగా సరిపోతుందట. అయితే ఆమె మాత్రం షూటింగ్‌కు సరైన సమయానికి రాకపోవడంతో క్రిష్ణవంశీ వేరే యాక్టర్‌ను వెతుక్కోవడానికి సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే అనసూయపై చేయాల్సిన సన్నివేశాలను పెండింగ్ పెట్టారట.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

అధికంగా పసుపు వాడితే?

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments