Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దర్సకుడితో రంగమ్మత్తకు చెడిందా? (Video)

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:48 IST)
బుల్లితెరమీదే కాదు వెండితెర మీద కూడా వెలుగొందుతోంది అనసూయ. జబర్దస్త్ తోనే ఆమెలోని టాలెంట్ బయటకు వచ్చింది. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
 
కరోనా సమయంలోను తన అభిమానులతో ఛాటింగ్ చేస్తూ సేఫ్ హోమ్ అంటూ చెబుతూ వచ్చింది. అయితే రంగమ్మత్తకు దర్సకుడు క్రిష్ణవంశీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. రంగమార్తాండ సినిమాలో రంగమ్మత్తుకు అవకాశం వచ్చింది.
 
అది కూడా కరోనాకు ముందే ఆమెకు ఈ అవకాశం లభించింది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యక్రిష్ణలవి కీలక పాత్రలైతే అనసూయ పాత్ర కూడా కీలకమేనట. మరాఠీలో సూపర్ హిట్ అయిన సినిమా ఆధారంగా రంగమార్తాండ సినిమా తెరకెక్కుతోంది.
 
కరోనా పుణ్యమా అని రెండునెలల పాటు షూటింగ్ నిలిచిపోతే తెలంగాణా ప్రభుత్వ అనుమతితో ప్రస్తుతం మళ్ళీ షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. అయితే షూటింగ్ లకు అనసూయ కూడా రెగ్యులర్ కూడా హాజరవుతోందట.
 
కానీ షూటింగ్ సమయానికి సరిగ్గా రాకపోవడం.. ఆలస్యంగా ఆమె రావడంతో దర్సకుడు క్రిష్ణవంశీతో వాగ్వాదం కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఒకవైపు జబర్దస్త్ మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉండడం వల్ల ఆమెకు సమయం సరిపోవడం లేదట.
 
రంగమార్తాండలో అనసూయకు ఇచ్చిన క్యారెక్టర్ ఆమెకు కరెక్టుగా సరిపోతుందట. అయితే ఆమె మాత్రం షూటింగ్‌కు సరైన సమయానికి రాకపోవడంతో క్రిష్ణవంశీ వేరే యాక్టర్‌ను వెతుక్కోవడానికి సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే అనసూయపై చేయాల్సిన సన్నివేశాలను పెండింగ్ పెట్టారట.

 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments