Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2లో సాయిపల్లవి.. గిరిజన యువతిగా కనిపిస్తుందా? (video)

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (11:35 IST)
తన సహజమైన నటనతో పాపులర్ అయిన సాయి పల్లవి పుష్ప-2లో భాగం కానుంది. పుష్ప 2: ది రూల్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ లేడీ రష్మిక మందన్న నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప-2లో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం సాగుతోంది. 
 
ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ తాజా సమాచారం సాయిపల్లవి నటించనుందని తెలిసింది. ఈ సినిమాలో ఆమె కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ సినిమా షూటింగ్‌లో త్వరలో సాయి పల్లవి జాయిన్ అయినట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపించనుంది. ఈ సినిమా కోసం ఆమె పది రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు సమాచారం. 
 
సాయి పల్లవి సెట్స్‌పైకి వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్, సాయి పల్లవి కాంబో అద్భుతంగా ఉంటుంది. 
 
ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ హైదరాబాద్‌లో అల్లు అర్జున్, సాయి పల్లవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. పుష్ప ది రూల్ 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి సీక్వెల్. పుష్ప పార్ట్ వన్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments