Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్‌తో కలిసి నటించాలనుంది.. త్రిప్తి డిమ్రీ.. అంత తక్కువ తీసుకుందా?

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (21:30 IST)
Tripti Dimri
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్‌తో కొన్ని సన్నివేశాల్లో నటించిన త్రిప్తి డిమ్రీ రాత్రికి రాత్రే సంచలనంగా మారింది. అయితే ఈ సినిమాకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఆమె యానిమల్‌లో జోయా పాత్రను పోషించింది. 
 
యానిమల్‌లో జోయా పాత్ర కోసం తృప్తి దిమ్రీ కేవలం రూ. 40 లక్షలు మాత్రమే తీసుకుందని టాక్ వస్తోంది. యానిమల్ సినిమాలో ఆమె పాత్ర చాలా మందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తృప్తి పారితోషికంపై సర్వత్రా చర్చ మొదలైంది. సందీప్ వంగా త్రిప్తికి అంత తక్కువగా ఎందుకిచ్చాడని టాక్ వస్తోంది. 
 
మరోవైపు సౌత్ ఎంట్రీపై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తన తొలి సినిమా బాగుంటుందని త్రిప్తి దిమ్రీ అన్నారు. యానిమల్‌తో యూత్ సెన్సేషన్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 
 
యానిమల్ తర్వాత ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా సౌత్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉందని చెప్పింది.
Tripti Dimri
 
జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని వుందని త్రిప్తి చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు త్రిప్తి దిమ్రీ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments