యాంకర్ లాస్యను లేపుకెళ్లి రహస్య పెళ్లి చేసుకున్న హీరో రాజ్ తరుణ్...
టాలీవుడ్లో వరుస విజయాలతో స్పీడ్గా దూసుకువచ్చిన హీరో ఎవరు అంటే అందరూ ఖచ్చితంగా చెప్పే పేరు రాజ్ తరుణ్. గత కొంత కాలంగా సక్సెస్ బాటలో నడుస్తున్న రాజ్ తరుణ్. ''ఉయ్యాల జంపాల'', ''సినిమా చూపిస్త మావా'', '
టాలీవుడ్లో వరుస విజయాలతో స్పీడ్గా దూసుకువచ్చిన హీరో ఎవరు అంటే అందరూ ఖచ్చితంగా చెప్పే పేరు రాజ్ తరుణ్. గత కొంత కాలంగా సక్సెస్ బాటలో నడుస్తున్న రాజ్ తరుణ్. ''ఉయ్యాల జంపాల'', ''సినిమా చూపిస్త మావా'', ''కుమారి 21F'', ''ఈడో రకం ఆడో రకం'' సినిమాల వరుస హిట్స్తో మంచి ఊపుమీదున్నాడు. ఈ కుర్ర హీరో ప్రస్తుతం మరో కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమా రాజ్ తరుణ్ గత సినిమాలకు భిన్నంగా ఉండే క్రైమ్ కామెడీ సినిమా అని సమాచారం. ఈ సినిమాకు "దొంగా''’ ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఈయన ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. కాగా ఈ హీరో గురించి వెలువడిన ఓ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అదేంటంటే... రాజ్ తరుణ్ యాంకర్ లాస్యను వివాహం చేసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బుల్లితెరలో పాపులర్ అయిన యాంకర్లలో లాస్య ఒకరు. కెరీర్ తొలినాళ్ళల్లో యాంకర్ రవితో కలిసి అనేక కార్యక్రమాలు చేసి ప్రేక్షకుల మనసుదోచుకున్న లాస్య వివాహంపై గతంలో పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. యాంకర్ రవిని లాస్య వివాహం చేసుకోబోతోంది అంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని, కేవలం తామిద్దరం మంచి స్నేహితులమని ఇద్దరూ బదులిచ్చుకోవడంతో, ఈ ప్రచారానికి తెరపడింది.
ఇప్పుడు లాస్య హీరో రాజ్ తరుణ్ను పెళ్లి చేసుకున్నట్లుగా వారి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావడం వల్లే ఇలా రహస్య వివాహం చేసుకోవాల్సి వచ్చినట్లుగా వారి సన్నిహితులు చెబుతున్నారు. రాజ్ తరుణ్తో ప్రేమకు లాస్య కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని... దీంతో లాస్యను బుల్లి తెరకు దూరం చేశారని సమాచారం. గత కొన్నాళ్లుగా లాస్య ఏ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు. తాజాగా లాస్య ఇంట్లోంచి వెళ్లి పోయి రాజ్ తరుణ్తో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరు కూడా కలిసి ఉంటున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఎంతవరకు నిజముందో తెలియాలంటే వీరిద్దరు నోరు విప్పాల్సిందే.