Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్లు... బెయిల్ రావాలంటూ ప్రార్థనలు!

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (14:54 IST)
కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్నారు. నిజానికి ఈ ఇద్దరికీ వృత్తిపరమైన విభేదాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరూ బయటవున్నప్పుడు నిత్యం పోట్లాడుకుంటూ ఉండేవారు. అయితే, వారి అదృష్టమో, దురదృష్టమో తెలియదుగానీ... వీరిద్దరూ ఒకే కేసులో అరెస్టు కావడమే కాదు.. జైలులో ఒకే గదిలో ఉండాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. దీంతో వారిద్దరూ నిత్యం పోట్లాడుకుంటూ జైలు అధికారులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారట. వారి సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారట. పైగా వీరికి త్వరగా బెయిలు రావాలని వేడుకుంటున్నారట. 
 
ఈ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వీరిద్దరిని అగ్రహార సెంట్రల్ జైల్లోని ఒకే సెల్‌లో వీరిద్దరినీ ఉంచారట. అర్థరాత్రి వరకు నిద్రపోకుండా లైట్లు వేసుకుని రాగిణి పుస్తకాలు, దినపత్రికలు చూస్తోందట. మళ్లీ ఉదయాన్నే నిద్రలేచి లైట్లు వేసుకుని యోగాసనాలు వేస్తోందట. 
 
అలా లైట్లు వెలుగుతూ ఉండడం వల్ల తనకు నిద్ర పట్టడం లేదని సంజన ఫిర్యాదు చేస్తోందట. అలాగే మరికొన్ని విషయాల్లో సంజనపై రాగాణి కంప్లైంట్లు చేస్తోందట. వీళ్ల ఫిర్యాదులతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారట. ఈ హీరోయిన్లద్దరికీ బెయిల్ త్వరగా వచ్చేయాలని వారి కంటే పోలీసులే ఎక్కువగా కోరుకుంటున్నారట. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments