Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీల్లో బూతు ప్రోగ్రాముల్ని ప్రసారం చేస్తున్నారు : సినీ న‌టి క‌విత

టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని విన‌డానికి వీలుల

Webdunia
ఆదివారం, 28 మే 2017 (16:33 IST)
టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని విన‌డానికి వీలులేని విధంగా ఉంటున్నాయని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ... తాము ఒక రోజు ఒక ఆడియో ఫంక్ష‌న్‌కి వెళ్లామ‌ని, 'జ‌బ‌ర్ద‌స్త్' వారు వేదిక‌పై కామెడీ ప్రోగ్రాం వేశారని ఆమె చెప్పారు. వారు చెప్పే డైలాగుల‌కి ఎంతో మంది విజిల్స్ వేస్తున్నారని చెప్పారు. జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటువంటి బూతు డైలాగులు వేస్తార‌ని త‌న‌కు అప్పుడే తెలిసింద‌ని అన్నారు.
 
అక్క‌డ‌ వెయ్యిమంది ఉంటే 998 మంది ఎంజాయ్ చేస్తున్నారని, కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే ఇబ్బంది ప‌డ్డారని ఆమె గుర్తు చేశారు. అనంత‌రం తాను ఓ జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడితో ఇటువంటి ప్రోగ్రాం ఎందుకు వేస్తార‌ని అడిగితే... 'చూసేవారు హ్యాపీగానే చూస్తున్నారు.. ప్రసారం చేసేవారు హ్యాపీగానే చేస్తున్నారు' అని సమాధానం చెప్పారని క‌విత అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments