Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు కొవ్వెక్కి బూతులు రాస్తున్నారు.. వెబ్‌సైట్ నిర్వాహకులపై హేమ ఫైర్

వెబ్ సైట్ నిర్వాహకులపై సినీ నటి హేమ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. తమ భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం వెబ్ సైట్ నిర్వాహకులు బూతులు రాస్తున్నారని నటి హేమ మండిపడింది. కేవలం సినిమా వారి మీదే కాకుండా.. సా

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (08:50 IST)
వెబ్ సైట్ నిర్వాహకులపై సినీ నటి హేమ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. తమ భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం వెబ్ సైట్ నిర్వాహకులు బూతులు రాస్తున్నారని నటి హేమ మండిపడింది. కేవలం సినిమా వారి మీదే కాకుండా.. సామాన్యులపై కూడా ఇలాంటి రాతలు రాస్తున్నారని.. అలాగే ఫేస్ బుక్‌లోనూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నాపని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. చదువుకి సంబంధించిన వాటిని గూగుల్‌లో సెర్చ్ చేస్తే దాని ప‌క్కన ఇది క్లిక్ చేయండంటూ అశ్లీల వీడియోలు, రాత‌లు ఉంటున్నాయ‌ని హేమ చెప్పుకొచ్చింది. 
 
కాగా న‌టుల‌పై వ‌స్తోన్న గాసిప్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన హేమ‌... ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్ట‌డం వ‌ల్ల అమ్మాయిలు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నార‌ని చెప్పింది. సినీ నటులే కాదు.. అన్నీ వర్గాల మహిళలపై కూడా వెబ్ సైట్ నిర్వాహకులు ఈ పని చేస్తున్నారని చెప్పింది. వెబ్ సైట్ నిర్వాహకులను ఒళ్లు కొవ్వెక్కి ఇలాంటి రాతలు రాస్తున్నారని.. ఎక్కడెక్కడో వుంటూ వార్తల్ని వెబ్ సైట్లలో పోస్టులు చేస్తుంటారని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments