నానికి కోపమొచ్చింది, ఆ సినిమాను అలా ఎందుకు చేస్తున్నారంటూ..?

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (14:02 IST)
ఏ హీరో అయినా తన సినిమాను థియేటర్లలో ప్రదర్సించాలి.. ప్రేక్షకులు క్యూ కట్టి చూడాలి.. రెస్పాన్స్ బాగా రావాలని అనుకుంటూ ఉంటారు. సినిమా తీసిన నిర్వాహకులందరూ కూడా అదే అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నిర్మాతలు తాము సినిమాకు ఖర్చు పెట్టినదాని కన్నా ఇంకా ఎక్కువగా రావాలని భావిస్తుంటారు.
 
కరోనా సమయం కావడంతో గత కొన్నినెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. సుమారుగా మూడునెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. కానీ ఆ తరువాత తెరుచుకున్నాయి కానీ సినిమాలు పెద్దగా లేవు. అడపాదడపా వస్తున్న రెండు, మూడు సినిమాలు మాత్రమే థియేటర్లలో ప్రదర్సితమవుతున్నాయి.
 
ఇప్పటికీ అన్ని థియేటర్లు ఓపెన్ కాలేదు. ఇలాంటి సమయంలో సహజనటుడు నాని నటించిన టక్ జగదీష్‌ను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్థమయ్యారు. ఈనెల 10వ తేదీన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారట.
 
దీంతో నానికి కోపమొచ్చింది. ఎందుకిలా చేస్తున్నారంటూ నిర్మాతలపై మండిపడ్డారట. హీరోనే కాదు ఎగ్జిబిటర్లు కూడా నిర్మాతల తీరుపై మండిపడుతున్నారట. అదే రోజు థియేటర్లలో లవ్ స్టోరీ సినిమా విడుదల అవుతుంటే థియేటర్లలోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాల్సింది పోయి ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ ప్రశ్నించారట.
 
అయితే దీనిపై నాని నోరు విప్పారు. థియేటర్లలో సినిమా విడుదలకే నేను ఇష్టపడతాను. ఓటీటీలో విడుదల చేయడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. నిర్మాతలు మొదటగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు నాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments