Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లకోసమే కొత్త నిర్మాతలొస్తున్నారు: విఎన్ ఆదిత్య

Webdunia
సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హిర్వాణి నిర్మాతగా ముంబయి తార విమలా రామన్, తరుణ్ నటిస్తోన్న చుక్కలాంటి అమ్మాయి... చక్కనైన అబ్బాయి చిత్రానికి ఇప్పటి వరకూ ముగ్గురు దర్శకులు మారారు. ఎందుకని ఆరా తీస్తే... దాని వెనుక ఎన్నో లుకలుకలు ఉన్నాయని సమాచారం.

చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న గోగినేని శ్రీను ఆ మధ్య చిత్ర షూటింగ్‌ను బ్యాంకాక్‌లో చేపట్టమని రెండో దర్శకుడు విఎన్ ఆదిత్యకు పురమాయించాడట. అనుకున్నట్లుగానే ఆదిత్య చిత్రం షూటింగ్ చేస్తున్నాడట. షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ విమలా రామన్ చెప్పా పెట్టకుండా ముంబయి చెక్కేసిందట.

కారణం ఏమిటి చెప్మా... అని ఆమెను కదిలిస్తే... గొల్లుమందట. తనను ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీను మానసికంగా వేధిస్తున్నాడనీ, అందుకే వచ్చేశానని వాపోయిందట. ఈ సంగతి ఇలా ఉంటే సదరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విఎన్ ఆదిత్యను కూడా శ్రీను "అన్ఫిట్" అనేశాడట. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే... విఎన్ ఆదిత్య తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. అదేమంటే.... చాలామంది కొత్త నిర్మాతలు కేవలం హీరోయిన్లకోసమే సినిమాలను చేసేందుకు వస్తున్నారు తప్ప ప్రేక్షకులకు వినోదాన్నందించే చిత్రాలను చేయడానికి కాదని వ్యాఖ్యానించాడు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొత్తానికి టాలీవుడ్ కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పోటీపడుతున్నట్లు కనబడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments