నందమూరి హీరో సుమంత్తో "రాజ్" సినిమాలో లిప్లాక్ చేసిన అందాల సుందరి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి.. జూనియర్ ఎన్టీఆర్తో రొమాన్స్ చేసేందుకు మళ్లీ రెడీ అవుతోంది.
యమదొంగ సినిమా ప్రియమణితో జతకట్టిన ఎన్టీఆర్, తాజాగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందే చిత్రంలో రెండో హీరోయిన్గా ప్రియమణినే సెలక్ట్ చేయాలని పట్టుబడుతున్నాడట.
గ్లామర్ పాత్రలతో పాటు లిప్టాక్కు కూడా సై అనడంతో ప్రియమణికి ఉన్న క్రేజ్ పెరిగిపోతుందని, ఆమెనే మరో కథానాయికగా ఎన్నుకోవాలని ఎన్టీఆర్ దర్శకునితో చెప్పినట్లు తెలిసింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఒక కథానాయికగా శృతిహాసన్ నటిస్తుండగా, ఎవరైనా ఫామ్లో ఉన్న హీరోయిన్ని పెట్టుకుందామని దర్శకుడు ఎంత చెప్పినా కానీ ఎన్టీఆర్ ససేమీరా అంటున్నాడట.
ప్రియమణి నటించడంతో యమదొంగ హిట్ అయ్యిందని, భారీ హిట్ కొట్టాలంటే మాత్రం బోయపాటి చిత్రంలో ప్రియమణి ఉండాల్సిందేనని ఎన్టీఆర్ దర్శకుడికి నచ్చజెప్పాడట. ఇంకేముంది.. రాజ్ సినిమాలో లిప్లాక్తో పాటు గ్లామరస్గా కనిపించిన ప్రియమణి, ఎన్టీఆర్తోనూ అందచందాలను ఆరబోసేందుకు రెడీ అయ్యిందని సినీ వర్గాల్లో టాక్.