బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనివాస్ను తొలిసారిగా వెండితెరకు హీరోగా పరిచయం చేస్తూ తీయబోతున్న చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకుడు. హీరోయిన్ సమంత.
కాగా ఈ చిత్రం డైరెక్షన్ చేసేందుకు వినాయక్కు బెల్లంకొండ ఏకంగా రూ. 10 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... హీరోయిన్గా నటించేందుకు అంగీకరించిన సమంతకు రూ. 2 కోట్లు ఇచ్చేందుకు కూడా బెల్లంకొండ సిద్ధమయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి.