వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ విడిపోయారు. ఆ జంటే ప్రభుదేవా - నయనతార. ప్రస్తుతం వీళ్లద్దరూ తాము విడిపోయినందుకు పశ్చాత్తాపంలో ఉన్నారట. ఇటీవల ప్రభుదేవాను కదిలిస్తే ఇదే విషయం చెప్పాడట.
నయన విషయంలో తాను తప్పు చేశానేమో అని అంటున్నాడట. ఐతే తమ ఎఫైర్ మాత్రం జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని ఇద్దరూ చెప్పుకుంటున్నారట.
ఏదేమైనా ఇద్దరు కూడా తమతమ కెరీర్లో ఫుల్ బిజీగా నిమగ్నమయి ఉన్నారు. ప్రభుదేవా బాలీవుడ్ సినిమాల దర్శకత్వంలో బిజీబిజీగా ఉంటే నయనతార మాత్రం తెలుగు సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉంది. ఏమో... ఇద్దరూ మళ్లీ కలుసుకుని పెళ్లి చేస్కుంటారేమో....