అరుంధతి తర్వాత పంచముఖి వంటి లేడి ఓరియెంటెడ్ రోల్స్ పోషిస్తూ వస్తున్న అనుష్క...తాజాగా రాణి రుద్రమదేవి పాత్రలో కనిపించనుంది. తమిళ "ఇరండామ్ ఒళగం" (రెండో ప్రపంచం)గా రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రంలో అనుష్క నటిస్తోంది.
అంతేగాకుండా ఆ సినిమా కోసం స్వయంగా డైలాగ్ చెప్పేందుకు సిద్ధపడుతోంది. తానే డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా అనుష్క ఈ సినిమాకు జాతీయ అవార్డును గెలుచుకుంటుందని టాక్.
అరుంధతిలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందిన అనుష్క.. కోలీవుడ్ ఇరండామ్ ఒళగం సినిమా ద్వారా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఈ సినిమా కోసం మొత్తం 40 రోజుల కాల్షీట్ ఇచ్చింది. జాతీయ అవార్డు కోసం సొంత గొంతుతోనే ఈ చిత్రంలో అనుష్క డైలాగ్లు చెబుతుందని తెలుస్తోంది. కానీ అనుష్కకు తమిళ భాష యావరేజ్గా ఉంటుందని సినీ పండితులు చెబుతున్నారు.