Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య చిచ్చు పెట్టేదెవరు..?

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (13:37 IST)
తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్దది కుటుంబం నందమూరి ఫ్యామిలీ. అయితే ఇటీవల నందమూరి ఫ్యామిలీలో విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య సంబంధాలు లేవు. అదేవిధంగా హరికృష్ణ - బాలకృష్ణ మధ్య కూడా అంతగా మాటలు లేవనే విషయం తెలిసిందే. 
 
ఇక పోతే కాస్తోకూస్తో మంచి సంబంధాలను కొనసాగిస్తున్న వారు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌‌. తాజాగా వీరి మధ్య కూడా చిచ్చు రగిలినట్లు కోలీవుడ్ టాక్. అది ఎవరని విచారిస్తే ఓ సినిమా అట. మే 1న బాలకృష్ణ తాజా సినిమా లయన్ విడుదల కాబోతుంది. మరో వారం రోజుల తేడాతో అంటే మే 7న రవితేజ కిక్ 2 విడుదలవుతుంది. 
 
బాబాయ్‌కి పోటిగా అబ్బాయ్ సినిమా విడుదలవడం పరిశ్రమలో చర్చనీయంశంగా మారింది. కిక్ 2 సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాత అన్న విషయం తెలిసిందే. అంతేకాదు బాలకృష్ణ, రవితేజల మధ్య కూడా పాత గొడవలు ఉన్నాయి.
 
గతంలో నటి మీరా జాస్మిన్ విషయంలో రవితేజపై బాలకృష్ణ చేయిచేసుకున్నాడనే వార్త అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. అప్పటి నుంచి వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని టాక్. ఆ మధ్య వచ్చిన రవితేజ చిత్రం బలుపులోని ఓ డైలాగ్ బాలయ్యని ఉద్దేశించినదే అనే టాక్ కూడా సంచలం సృష్టించింది. 
 
ఇన్ని సమస్యల నడుమ వస్తున్న కిక్ 2 మే 7 న విడుదల అవుతుండడంతో మళ్ళీ పాత గొడవలు మొదలవడం ఖాయం అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద లయన్, కిక్ 2ల విడుదల వలన బాబాయ్, అబ్బాయ్‌ మధ్య చిచ్చు రగులుకుంటుందని సినీ వర్గాల టాక్.

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Show comments