త్రిష, పూనమ్ బాజ్వా, ఓవియా నటిస్తున్న సినిమాకు ''మేము'' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ఎన్.పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు హెచ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మితమవుతోంది.
ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే జర్నీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం రిలీజ్ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా త్రిష ప్రస్తుతం బాలకృష్ణ లయన్ సినిమా నటిస్తుండగా.. మరో హారర్ ఫిలిమ్లో నటించేందుకు సైతం సంతకం చేసేసిందట.!