Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండుతున్న ఎండలు... విశాఖలో కంట్రోల్ రూం.. టోల్ ఫ్రీ నెంబరు!

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (16:11 IST)
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో పిట్టలు రాలినట్లు ప్రజలు మృత్యువాతపడుతున్నారు. ఎక్కడ ఏ సమయంలో ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం మొత్తం అప్పమత్తమైంది. 
 
ప్రజలను ఎండల బారి నుంచి రక్షించాలని సంకల్పించింది. తొలిసారి ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేసి దానికి 180042500002 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించింది. తద్వారా వడదెబ్బ తగిలినా, ఎండలకు అత్యవసర సేవలు అవసరమైనా ఈ నెంబరుకు ఫోన్ చేసి తెలపాలని అధికారులు సూచించారు.
 
అదేవిధంగా మండల ఎమ్మార్వోలంతా కలిసి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డీఆరోవో నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. నగర పరిధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని గ్రేటర్ కమిషనర్కు కూడా లేఖ రాశారు. అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉపాధి హామీ పనుల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments