Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి: వెయ్యి గుర్రాలతో అదుర్స్ షూటింగ్!!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (12:19 IST)
ఎస్.ఎస్. రాజమౌళి మేకింగ్ ఫిలిమ్ ''బాహుబలి'' కోసం వెయ్యి గుర్రాలు సిద్ధమవుతున్నాయి. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాహుబలి కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఓ అద్భుత యుద్ధ సన్నివేశం కోసం రాజమౌళి వెయ్యి గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. 
 
బాహుబలిని అద్భుతంగా తెరకెక్కించేందుకు ఎక్కడా రాజీ పడని రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో యుద్ధ సన్నివేశం చిత్రీకరణ కోసం రాజమౌళి రాజస్థాన్ నుంచి వెయ్యి గుర్రాలను కొన్నాడు.
 
ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెయ్యి గుర్రాలతో కూడిన యుద్ధ సన్నివేశాన్ని సోమవారం (22.12.14) నుంచి షూట్ చేస్తారని తెలిసింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, బాహుబలి ఫస్ట్ పార్ట్‌ను 2015 ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ చేసేందుకు రాజమౌళి ముహూర్తం ఖరారు చేసారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments