Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మై ట్రీ ఛాలెంజ్‌'కు మహేష్ బాబును నామినేట్ చేసిన సూర్య!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (18:18 IST)
'ఐస్ బకెట్ ఛాలెంజ్' తర్వాత తాజాగా 'మై ట్రీ చాలెంజ్‌' పుట్టుకొచ్చింది. చెట్లు పెంచడం, పర్యావరణాన్ని కాపాడటం అనే ఒక సదుద్దేశ్యంతో మొదలైన ఈ మై ట్రీ చాలెంజ్‌ను ప్రముఖ మళయాల నటుడు మమ్ముట్టి స్వీకరించి.... సూర్య, విజయ్, షారుక్ ఖాన్‌లను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేశారు. 
 
ఈ ఛాలెంజ్ స్వీకరించిన సూర్య... మహేష్ బాబు, సుదీప్, అమీర్ ఖాన్‌లను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. మరి సూర్య విసిరిన ఈ మై ట్రీ ఛాలెంజ్‌ను మహేష్ బాబు త్వరలో స్వీకరించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి మహేష్ బాబు, సూర్యల మధ్య మంచి స్నేహం ఉంది. 
 
అయితే, సూర్య విసిరిన ఈ ఛాలెంజ్‌ను మహేష్ బాబు స్వీకరిస్తారా లేదా అని చూడాల్సిందే. మహేష్ బాబు చొరవ చూపితే.. రాష్ట్రంలోని ఆయన అభిమానులంతా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా మహేష్ బాబు సూర్య విసిరిన ‘ట్రీ' ఛాలెంజ్ స్వీకరించాలని ఆశిద్దాం. వీలైతే మీరు కూడా ఈ మై ట్రీ ఛాలెంజ్ స్వీకరించి మీ స్నేహుతులను కూడా చెట్లు నాటడం వైపు ప్రొత్సహించండి. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments