Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెస్ నారాయణ 'మిమ్మల్ని మిస్సవుతున్నాం'.. రాజమౌళి.. పూరీ జగన్నాథ్

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (12:12 IST)
హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ చనిపోయినట్టు వార్త తెలియడంతోనే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ షాక్‌కు గురయ్యారు. ఎమ్మెస్ హఠాన్మరణం చెందడం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపాడు. ఎమ్మెస్ ఆత్మకు శాంతి కలగాలంటూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. మరో టాప్ డైరక్టర్ రాజమౌళి కూడా ఎమ్మెస్ నారాయణ మృతి పట్ల స్పందిస్తూ... సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 'మిమ్మల్ని మిస్సవుతున్నాం' అంటూ పోస్టు పెట్టారు. 
 
అలాగే, నటుడు ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల మంచు లక్ష్మి స్పందించింది. ఎమ్మెస్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టింది. అంకుల్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, తన తండ్రి మోహన్ బాబే నటించేందుకు ఆయనను ప్రోత్సహించారని తెలిపింది. 
 
ఆయనతో ఎన్నో సరదా జ్ఞాపకాలు ఉన్నాయని, అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకున్నారని తెలిపింది. ఆయన సినీకళామతల్లి ఉన్నంత వరకు గుర్తుండిపోతారని పేర్కొంది. చివరిసారి ఆయనతో మాట్లాడినప్పుడు కుమార్తె శశి దర్శకత్వం వహించడం పట్ల గర్వంతో పొంగిపోయారని లక్ష్మి గుర్తు చేసుకుంది. ఎమ్మెస్ కుమార్తె శశి నారాయణ సాహెబా సుబ్రహ్మణ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. 

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments