''శర్వానంద్ నా భర్త'' అంటూ నిత్యా మీనన్ కామెంట్ చేసింది. అయితే అది రియల్ లైఫ్లో కాదు.. రీల్ లైఫ్లోనని స్పష్టం చేసింది. ఇందుకు శర్వానంద్ కూడా ఓకే చెప్పేశారని నిత్యా మీనన్ చెప్పింది. బెంగళూరు డేస్ అనే మలయాళం సినిమానే ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజు పీవీపీ సంస్థతు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించే పనుల్లో పడ్డారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో రీమేక్ కానుంది. రానా, ఆర్య, శ్రీ దివ్య ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్లో నిత్యా మీనన్ హీరోయిన్గా, శర్వానంద్ హీరోగా నటించబోతున్నారు.
దీనిపై నిత్యా మీనన్ స్పందిస్తూ., తాను బెంగళూరు డేస్లో లీడ్ రోల్ చేస్తున్నానని, శర్వానంద్ తన భర్తగా నటించేందుకు ఓకే చెప్పేశారు. అంటూ తెలిపింది. కాగా ఏమిటో ఈ మాయ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాల తర్వాత శర్వానంద్, నిత్యామీనన్ మూడోసారి ముచ్చటగా జతకట్టనుంది.